భూదాన్ భూమి అప్రోచ్ రోడ్డు కబ్జా.. బీఆర్ఎస్ నేతపై కేసు

భూదాన్ భూమి అప్రోచ్ రోడ్డు కబ్జా.. బీఆర్ఎస్ నేతపై కేసు

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: భూదాన్ భూమి అప్రోచ్ రోడ్డును కబ్జా చేశారనే ఆరోపణతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అనుచరుడు బీఆర్ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డిపై కేసు నమోదైంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారమతి పేట్ రెవెన్యూ పరిధిలోని  235 సర్వే నంబర్ లో ఉన్న భూదాన్ భూమి రోడ్డులో రఘువీర్ రెడ్డి కంటైనర్ ఏర్పాటు చేశాడని రెవెన్యూ గిర్ధవార్ ఫిర్యాదు చేశారు.

 ఆయన ఫిర్యాదుతో అబ్దుల్లాపూర్​మెట్​పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.