కేటీఆర్ ముందే నేతల బాహాబాహీ.. తోపులాట

కేటీఆర్ ముందే నేతల బాహాబాహీ.. తోపులాట

నారాయణ గూడలో మంత్రి కేటీఆర్ ముందే బీఆర్ఎస్ నాయకులు బాహాబాహీకి దిగారు. పోటాపోటీ నినాదాలు చేస్తూ ఒకరినొకరు తోసేసుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

కాచిగూడ డివిజన్లో నూతన మున్సిపల్ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ వచ్చారు. అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అవినీతికి పాల్పడుతున్నారని పార్టీ సీనియర్ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ కి ఫిర్యాదు చేశారు అంబర్ పేట  నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ ఎడ్ల సుధాకర్ రెడ్డి. దళితబంధు తరహా పథకాలలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.  దీంతో  ఎడ్ల సుధాకర్ రెడ్డి , ఎమ్మెల్యే వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేశారు.  స్వల్ప తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే  పోలీసులు స్పందించి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు.