ప్రజాపాలన అంటూ..ప్రతిపక్ష నేతలపై కేసులా? : బీఆర్ఎస్ నేతలు

ప్రజాపాలన అంటూ..ప్రతిపక్ష నేతలపై కేసులా? : బీఆర్ఎస్ నేతలు
  •     హరీశ్​రావు సిట్​ విచారణపై  బీఆర్ఎస్​ నేతల ఫైర్​

హైదరాబాద్​, వెలుగు: ప్రజాపాలన పేరుతో ప్రతిపక్ష నేతలపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మంగళవారం హరీశ్ రావు సిట్​విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్​నేతలు తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని హరీశ్ రావు బయటపెట్టగానే సిట్​ నోటీసులు పంపారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అవినీతి ఆరోపణలంటూ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వం డైవర్షన్​ పాలిటిక్స్​కు తెరదీస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో రెండేండ్లుగా ఏం జరుగుతున్నదో ప్రజలు చూస్తున్నారని, సీరియల్​లాగా రోజుకో కేసు పేరుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.  

పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించామని, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే రిపీట్​ అవుతుందనే భయంతో కేసులు పెడుతున్నారని తెలిపారు. రెండేండ్లుగా మంత్రులు కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కక్షసాధింపులో భాగంగానే హరీశ్​రావుకు సిట్​నోటీసులు ఇచ్చారని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి ఆరోపించారు. బీఆర్ఎస్​ అంటే స్కీమ్​లని, కాంగ్రెస్​ అంటే స్కామ్​ల ప్రభుత్వమని విమర్శించారు.