గెలుపే లక్ష్యంగా పని చేయాలి : మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్రెడ్డి

గెలుపే లక్ష్యంగా పని చేయాలి  : మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్రెడ్డి

నల్లబెల్లి, వెలుగు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్​రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో శుక్రవారం బీఆర్ఎస్ అధ్యక్షుడు బానోతు సారంగపాణి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్​ హయాంలో నర్సంపేట నియోజకవర్గ అభివృద్ది కోసం రెండు వందల కోట్లు నిధులు తీసుకువచ్చినట్లు గుర్తుకు చేశారు. 

స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అంతకుముందుగా నల్లబెల్లికి చెందిన పలువురు యువకులు సుదర్శన్​రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు. కార్యక్రమంలో బీఆర్​ఎస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.