
హైదరాబాద్, వెలుగు: జియోగ్రాఫికల్ఇండికేషన్ (జీఐ) గుర్తింపు పొందిన చేర్యాల పెయింటింగ్ ను టీషర్టుల పైన వేసిన తెలంగాణ కళాకారులను బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్అభినందించారు. కళాకారులు రాకేశ్, వినయ్శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. తాము పెయింటింగ్వేసిన టీ షర్ట్లను కేటీఆర్కు అందజేయగా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్మాట్లాడారు.
ఇలాంటి వినూత్న పద్ధతులతో సంప్రదాయ కళలకు ఎక్కువ డిమాండ్వస్తుందని కేటీఆర్అన్నారు. వీటికి బ్రాండింగ్ చేసి ఆన్లైన్లో మార్కెటింగ్సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, కల్వకుంట్ల సంజయ్, తెల్లం వెంకట్రావు, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.