చేతులెత్తి నమస్కరిస్తున్నా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ పైసలను ముట్టుకోకండి..

చేతులెత్తి నమస్కరిస్తున్నా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ పైసలను ముట్టుకోకండి..
  • ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​రావు

మిర్యాలగూడ, వెలుగు: ‘సర్పంచులు.. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు.. కౌన్సిలర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నా..కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ​పైసలను దయచేసి ముట్టుకోకండి..మీకేమైనా ఇబ్బందయితే నేనిస్తా’ అని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​రావు అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో నియోజకవర్గ పరిధిలోని 398 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ లబ్ధిదారులకు రూ.3.98 కోట్ల  విలువైన చెక్కులను అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ఊళ్లలో కొందరు ప్రజాప్రతినిధులు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ స్కీంలకు మధ్యవర్తులుగా మారి పైసలు అడుగుతున్నట్లు తెలిసిందని ఈ వసూళ్లు ఆపాలని అని ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులకు హెచ్చరించారు. పదేండ్లుగా ఎటువంటి అభివృద్ధి చేయనోళ్లు..ఏదో చేస్తమని ప్రచారం చేసుకుంటుండ్రు..ఎవరి మాటలు నమ్మొద్దన్నారు. కార్యక్రమంలో రైతు ఆగ్రోస్​ చైర్మన్​ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్​ చైర్మన్​ తిరునగర్ భార్గవ్​, రైతుబంధు సమితి  జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎంపీపీలు సరళ , నందిని, డీసీఎంఎస్​ వైస్​ చైర్మన్​ నారాయణరెడ్డి, కౌన్సిలర్లు రమేశ్​, ఉదయ్​ భాస్కర్ గౌడ్​​తదితరులు పాల్గొన్నారు.