స్టేజ్పైనే ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మధ్య వాగ్వాదం

స్టేజ్పైనే ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మధ్య వాగ్వాదం

మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇవాళ మహబూబాబాద్ జిల్లా గూడూరులో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ  సమ్మెళన  సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, పలువురు నేతలు పాల్గొన్నారు. అయితే ఈ సభలో మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ మాట్లాడుతుండగా మధ్యలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కల్పించుకున్నారు. దీంతో ఆగ్రహించిన మాజీ ఎంపీ.. మంత్రి సమక్షంలోనే ఎమ్మెల్యేపై రుసురుసలాడారు.

నీ నోరే గట్లనా.. నీ నోరే గట్లుంటాదా..  అంటూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై సీతారాం నాయక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభలు,సమావేశాల్లో ప్రోటోకాల్ పాటించాలని స్టేజ్ పైనే ఎమ్మెల్యే కు హితబోధ చేశారు. రెండు నిముషాలు ఓపిక పట్టరాదు.. అంటూ చురకలు అంటించారు. కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు కొంత ప్రోటోకాల్ పాటించాలని, ఎందుకు ఊకే ప్రతీ దాంట్లో ఏదో ఓటి చేస్తావ్ అని మండిపడ్డారు. మనది 5 సంవత్సరాల నుండి స్నేహం, నిన్ను ఐదేళ్లలో 24 గంటలూ కాపాడుతూ వచ్చానంటూ సీతారామ్ నాయక్ చెప్పారు. ఇక అంతకుముందు సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే.. గూడూరు మండలంలో ఐటిడిఏ నిధులు మంజారు చేయాలంటూ మంత్రి  సత్యవతి రాథోడ్ గదవపట్టుకొని రిక్వెస్ట్ చేశారు.