- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి కనీస రాజ్యాంగ స్ఫూర్తి, అవగాహన లేదని, ట్రాఫిక్ చలాన్ల సొమ్ము నేరుగా పోలీస్వాళ్ల అకౌంట్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని చెప్పడమేంటని బీఆర్ఎస్ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్అన్నారు. రేవంత్ది అజ్ఞానమా? అహంకారమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
ఈ మేరకు మంగళవారం తెలంగాణభవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. గ్రూప్–1 పరీక్షలను అక్రమంగా నిర్వహించి విద్యార్థుల జీవితాలను బలి చేశారని ఆరోపించారు. చలాన్లు వేసేముందు రేవంత్రోడ్ల మీద ఉన్న గుంతలను పూడ్చాలని సూచించారు. సీఎం నోటి నుంచి ఒక్క పదం వచ్చినా దానికి చట్టబద్ధత ఉంటుందని, లేదంటే ప్రభుత్వం జోకర్గా మిగిలిపోతుందన్నారు. రేవంత్దేశానికి రాజు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
