liquor scam : మీడియాకు ఫోన్లు చూపించిన కవిత

liquor scam : మీడియాకు  ఫోన్లు చూపించిన కవిత

ఈడీ విచారణకు హాజరుకావటానికి.. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని ఇంటి నుంచి బయలుదేరే సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటి ఎదుట ఉన్న మీడియాకు తన మొబైల్ ఫోన్లను చూపించారు. రెండు కవర్లలో ఉన్న ఫోన్ల చూపించారు. ఎమ్మెల్సీ కవిత వ్యవహారం సంచలనంగా మారింది. మార్చి 21వ తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో ఆమె ఈడీ విచారణకు హాజరయ్యారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో. .  కవిత ఫోన్లు పగలగొట్టారని.. చాలా ఫోన్లు ఉపయోగించారనే ఆరోపణలు వచ్చాయి. 10 ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలు రావటంతో.. వాటికి సంబంధించి తన దగ్గర ఉన్న ఫోన్లను చూపించినట్లు తెలుస్తుంది. రెండు కవర్లలోని నాలుగు, ఐదు ఫోన్లను తనతోపాటు ఈడీ ఆఫీసుకు తీసుకెళ్లారు కవిత. ఆమెతోపాటు లాయర్లు కూడా వెంట ఉన్నారు. ఈడీ అధికారులకు తాను ఉపయోగించిన ఫోన్లను సమర్పించనున్నట్లు తెలుస్తుంది.