అక్టోబర్19 నుంచి మంత్రి తలసాని పాదయాత్ర

అక్టోబర్19 నుంచి  మంత్రి తలసాని పాదయాత్ర

హైదరాబాద్/పద్మారావునగర్/సికింద్రాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​సనత్​నగర్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ యాదవ్ గురువారం నుంచి వివిధ డివిజన్లలో పాదయాత్రలు నిర్వహించనున్నారు.  గురువారం ఉదయం 8.30 గంటలకు మోండా మార్కెట్ డివిజన్‌‌‌‌‌‌‌‌ బండిమెట్ నుంచి పాదయాత్ర ద్వారా ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.  పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బండిమెట్, మారుతి వీధి, నాలా బజార్, ఓల్డ్ జైల్ ఖానాలలో ప్రచారం ఉంటుందని తెలిపారు. 10  ఏండ్లలో చేసిన పనులే తమను గెలిపిస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. బుధవారం పద్మారావునగర్ పార్కు వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మారేడ్​పల్లిలోని పద్మశాలి కల్యాణ మండపంలో జరిగిన బీఆర్ఎస్ సనత్ నగర్ సెగ్మెంట్ పోలింగ్ ఏజెంట్ల అవగాహన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ, అభ్యర్థి గెలుపులో పోలింగ్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమైందని ఆయన తెలిపారు.