ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్ వేసింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ తరపున పోటీ చేస్తున్న దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ ఏప్రిల్ 15న విచారణకు రానుంది. దానంపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్కు కలిసి ఫిర్యాదు చేశారు కౌశిక్ రెడ్డి. స్పీకర్ స్పందించకపోవడంతో ఏప్రిల్ 10న హైకోర్టును ఆశ్రయించారు. దానంపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరారు.