
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 90 నుంచి 100 సీట్లు గెలుచుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సౌత్ ఇండియాలో హ్యాట్రిక్ కొట్టిన సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తరువాత జరుగుతోన్న మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు.
బీజేపీ100 సీట్లలో డిపాజిట్లు కోల్పోతుందని కేటీఆర్ విమర్శించారు. బీజేపీతో పాటుగా, కాంగ్రెస్ పార్టీలు సీఎం అభ్యర్థులను ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ గా పేరు మారింది తప్ప తమ పార్టీ డీఎన్ఏ, ఎజెండా, పార్టీ గుర్తు, తత్వం, నాయకుడు మారలేదని చెప్పారు.
కేటీఆర్ కాబోయే సీఎం అంటూ వస్తోన్న వార్తలపై కూడా కేటీఆర్ స్పందించారు. తమ నాయకుడు కేసీఆర్ కు ఇంకా 70 ఏళ్లు కూడా నిండలేదని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్కు 80 ఏళ్లు.. ఆయన మరో పదవీకాలం కోసం పోటీ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు తమ నాయకుడు ఎందుకు రిటైర్ కావాలని ప్రశ్నించారు. కేసీఆరే తమ పార్టీకి గుర్తింపు అని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అరంగేట్రం ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలమే సమాధానం చెప్పగలదని కేటీఆర్ తెలిపారు.