కర్ణాటక కమలానిదే..బలపరీక్షలో యడియూరప్ప విన్

కర్ణాటక కమలానిదే..బలపరీక్షలో యడియూరప్ప విన్

కర్ణాటక అసెంబ్లీలో యడియూరప్ప సర్కార్ బల పరీక్షలో నెగ్గింది. బలపరీక్షకు మద్దతుగా 106 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మ్యాజిక్ ఫిగర్ (104) కంటే ఎక్కువ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఓటు వేయడంతో యడియూ రప్ప బలపరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. బీజేపీకి స్వతగానే 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకో స్వతంత్ర్య అభ్యర్థి  బీజేపీకి మద్దతుగా ఓటు వేయడంతో బలపరీక్షకు మద్దతుగా 106 ఓట్లు పడ్డాయి. 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 107 కు పడిపోయింది.