ముషీరాబాద్, వెలుగు: పెరిగిన ధరలకు అనుగుణంగా 15 శాతం ఫిట్మెంట్ పెంచి పెన్షన్ రివిజన్ చేయాలని బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ పెన్షనర్స్ డిమాండ్ చేశారు. సోమవారం కవాడిగూడలోని సీసీఏ పెన్షన్ ఆఫీస్ వద్ద వివిధ సంఘాల ఆధ్వర్యంలో రిటైర్డ్ పెన్షనర్స్ నిరసన చేపట్టారు.
సంఘం ప్రతినిధులు డి. శంకర్, గోలి రమేశ్, రామచంద్రుడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... 2017 నుంచి పెన్షన్ రివిజన్ చేసి అమలు చేయాలన్నారు. పెన్షన్స్ సవరణ బిక్ష కాదని.. హక్కు అని, దాన్ని సాధించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.