గల్ఫ్ బాధితులు గోడు పట్టదా..  రియల్ వ్యాపారులకోసమే 111 జీవో రద్దు

గల్ఫ్ బాధితులు గోడు పట్టదా..  రియల్ వ్యాపారులకోసమే 111 జీవో రద్దు

తెలంగాణ సీఎం కేసీఆర్ కు రైతుల గోడు పట్టదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.  అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు.  

గల్ఫ్ బాధితుల సంక్షేమ నిధి ఎక్కడ?

పొట్టకూటి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్ళిన పేదల గోడు KCRకు పట్టదన్నారు బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్. బాధితుల కోసం 500 కోట్ల రూపాయిలతో సంక్షేమనిధి,ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తానన్న హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.  BSP అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికుల కోసం ఉద్యోగ,ఆరోగ్య భద్రత, ఏజెంట్ల మోసాలు లేని NRI పాలసీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

 ప్రభుత్వం భూ కబ్జాదారుల చేతుల్లో బందీ

KCR ప్రభుత్వం భూ కబ్జాదారుల చేతుల్లో బందీ అయ్యింది.హైదరాబాద్​ చుట్టుపక్కల వేల ఎకరాల భూములను అక్రమంగా కొనుగోలు చేసిన రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు,రాజకీయ నేతల మెప్పు కోసమే 111 జీవో ఎత్తేశారని విమర్శించారు. హిమాయత్ సాగర్,ఉస్మాన్ సాగర్లు పాలకుల ధన దాహానికి బలి కాబోతున్నాయన్నారు బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్.