గూగుల్ అకౌంట్ల నుంచి పర్సనల్ డేటా సేకరించి.. బ్లాక్ మెయిల్
బీటెక్ స్టూడెంట్ అరెస్ట్
ఎల్ బీ నగర్,వెలుగు: లోకంటో డాట్ కామ్ నుంచి ఇతరుల ఫోన్ నంబర్లు సేకరించి తర్వాత వారి గూగుల్ అకౌంట్ల నుంచి పర్సనల్ డేటా తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న బీటెక్ స్టూడెంట్ ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పల్లెర్లకు చెందిన ఆరెసాని భరత్ కుమార్(21) ఘట్ కేసర్ లో ఉంటూ శివారులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈజీగా మనీ సంపాదించాలనే ఆలోచనతో లోకంటో డాట్ కమ్ వెబ్ సైట్ నుంచి ఇతరుల నంబర్లు సేకరించేవాడు. ఆ నంబర్లను గూగుల్ లో టైప్ చేసేవాడు. ఎవరిదైనా మెయిల్ ఐడీ వచ్చి దానికి అదే మొబైల్ నంబర్ పాస్ వర్డ్ గా ఉంటే వాటిని ఓపెన్ చేసేవాడు. మెయిల్ ఐడీ నుంచి గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్ లోకి వెళ్లి వారి పర్సనల్ ఇన్ ఫర్మేషన్, ఫొటోలను సేకరించేవాడు. తర్వాత ‘సెకండ్ లైన్’ యాప్ ను డౌన్ లోడ్ చేసి ఇతర దేశాలకు సంబంధించిన నంబర్ లాగా వాట్సాప్ క్రియేట్ చేసుకునేవాడు. అందులో నుంచి తాను సేకరించిన ఫొటోలను బాధితుల వాట్సాప్ కి పెట్టి డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసేవాడు. డబ్బులు అకౌంట్ లో వేయకపోతే పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని, కుటుంబీకులు, ఫ్రెండ్స్ కి షేర్ చేస్తానని బెదిరించేవాడు. సిటీకి చెందిన ఓ బాధితురాలు ఇచ్చిన కంప్లయింట్ తో కేసు ఫైల్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు భరత్ కుమార్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
బ్లాక్ మెయిల్ చేస్తున్న బీటెక్ స్టూడెంట్ అరెస్ట్
- హైదరాబాద్
- December 24, 2020
లేటెస్ట్
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
- GT vs RCB: కోహ్లీ మెరుపు ఫీల్డింగ్.. పెవిలియన్ బాట పట్టిన షారుఖ్ ఖాన్
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: టీడీపీకి షాక్.. సీఐడీ చర్యలకు ఈసీ ఆదేశాలు..
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ