కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల తీరిదీ..
న్యూఢిల్లీ: రూపాయిని యూనిట్గా తీసుకొని కేంద్ర బడ్జెట్ని పరిశీలిస్తే ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలోని ప్రతి 100 పైసల్లో (ఒక రూపాయిలో) 68 పైసలు డైరెక్ట్, ఇన్డైరెక్ట్ ట్యాక్స్ల నుంచే వస్తున్నట్లు గమనించొచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2019–20 బడ్జెట్ ఈ విషయాన్నే చెబుతోంది. అప్పులతోపాటు అదర్ లయబిలిటీస్ ద్వారా 20 పైసలు ఖజానాకు చేరుతున్నాయి. మిగతా 12 పైసల్లో 9 పైసలు నాన్–ట్యాక్స్ రెవెన్యూ కాగా 3 పైసలు నాన్–డెబ్ట్ క్యాపిటల్ రిసీట్లతో వస్తున్నాయి. అన్నిటికన్నా ఎక్కువ రాబడి (21 పైసలను) కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా వస్తోంది. దాని తర్వాతి స్థానం జీఎస్టీదే.
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) 19 పైసల ఆదాయం ఇస్తోంది. ప్రతి రూపాయిలో 16 పైసలను ఇన్కం ట్యాక్స్ సమకూరుస్తోంది. యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ 8 పైసలు ఇస్తుండగా కస్టమ్స్ నుంచి 4 పైసలు గల్లా పెట్టెలోకి చేరుతున్నాయి. ఇక, ఖర్చుల విషయానికి వస్తే ట్యాక్సులు, డ్యూటీస్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన షేరే అన్నిటికన్నా ఎక్కువ. మొత్తం ఖర్చులో దీని వాటా 23 పైసలు. ఆ తర్వాత.. అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలది (18 పైసలు) రెండో స్థానం. డిఫెన్స్కి గతేడాది మాదిరిగానే ఈసారీ 9 పైసలే కేటాయించారు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్లకు 13 పైసలు, సెంట్రల్లీ–స్పాన్సర్డ్ స్కీమ్లకు 9 పైసలు ఖర్చు చేస్తారు. ఫైనాన్స్కమిషన్ సూచించే కార్యక్రమాలతోపాటు ఇతర ట్రాన్స్ఫర్ల కోసం 7 పైసలు; సబ్సిడీలకు 8 పైసలు, పెన్షన్లకు 5 పైసలు, వేరే ఖర్చులకు 8 పైసలు ఇస్తారు.