హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు: 20 రోజులు..172 పశువులు స్వాధీనం..అక్రమ ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాణాను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు: 20 రోజులు..172 పశువులు స్వాధీనం..అక్రమ ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాణాను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గత 20 రోజుల్లో ఎంఎంసీ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న  172 పశువులను పట్టుకున్న పోలీసులు వెటర్నరీ అధికారులకు అప్పగించారు. తర్వాత ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శువుల సంర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షణ కేంద్రానికి త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లించారు. 

మాద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నపేట, నాగోల్, సంతోష్​నగర్, వనస్థలిపురం, సరూర్​నగర్, ఎల్బీనగర్, బోయిన్​పల్లి, అబ్దుల్లాపూర్​మెట్ తదితర ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేయగా, అక్రమంగా తరలిస్తున్న పశువులు కనిపించాయి. స్వాధీనం చేసుకున్న పశువుల్లో 13 గోశాలలకు, 103 ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శువుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫతుల్లాగూడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎంఎంసీ ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శువుల సంర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షణ కేంద్రానికి త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లించారు.  

3 ఆవులు, 52 ఎద్దులు, 15 బర్రెలు, 33 దున్నపోతులు ఉన్నాయి. ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శువుల సంరక్షణ కేంద్రానికి త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లించిన ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శువుల ఆరోగ్య ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిస్ధితిని వెట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్నరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిశీలించారు. అస్వస్థతకు గురైన వాటికి వెటర్నరీ ఆఫీసర్ సంజీవ్ రెడ్డి ట్రీట్​మెంట్​ఇచ్చారు. అలాగే వాటిని సిబ్బంది సాయంతో అబ్జర్వేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ లో ఉంచారు.