కరీంనగర్: లారీని ఢీకొన్న బస్సు

కరీంనగర్: లారీని ఢీకొన్న బస్సు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు లారీని ఢీ కొట్టింది. ప్రమాదంలో దాదాపు 20 మందికి గాయాలు అవ్వగా… బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. బస్సు హైదరాబాద్ నుంచి జగిత్యాల  జిల్లా మెట్ పల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అధికారులు.