ప్రైవేట్ బస్సు బోల్తా..30 మందికి తీవ్ర గాయాలు

ప్రైవేట్ బస్సు బోల్తా..30 మందికి తీవ్ర గాయాలు

ప్రైవేట్ బస్సు బోల్తాపడ్డ ప్రమాదంలో 30 మందికి పైగా తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఉదయం కృష్ణా జిల్లాలో జరిగింది. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై రమణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట దగ్గర అదుపుతప్పి బస్సు బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్నవారిలో 30మందికి గాయాలయ్యాయి. యానం నుంచి హైదరాబాదు వెళుతుండగా బస్సు ఒక్కసారిగా అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు ప్రయాణికులు.

గాయాలైన వారిలో పదిమంది చిన్నారులు ఉన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. గాయపడ్డవారిని నందిగామ ప్రభుత్వ హస్పిటల్ కి తరలించారు. ఇందులో ముగ్గురు చిన్నారుల పరిస్ధితి విషమంగా ఉండటంతో విజయవాడకు తరలించినట్లు తెలిపారు పోలీసులు.