లఖీంపూర్ ఖేరిలో ఘోర రోడ్డు ప్రమాదం

లఖీంపూర్ ఖేరిలో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తర ప్రదేశ్ లఖీంపూర్  ఖేరిలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొని 8 మంది చనిపోయారు. ప్రమాదంలో మరో 25 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. తీవ్రంగా గాయపడిన మరికొందరిని లక్నో హాస్పిటల్ కు తరలించినట్లు లఖీంపూర్ ఖేరి ADM సంజయ్ కుమార్ తెలిపారు. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని అధికారులను ఆదేశించారు.