2000 వ సంవత్సరం తర్వాత కంపెనీ ఏర్పాటు చేసి, ఎదిగిన టాప్ సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రెనూర్ల లిస్ట్ను ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హురున్ ఇండియా కలిసి విడుదల చేశాయి. ఈ లిస్ట్లో డీమార్ట్ ఫౌండర్ రాధాకిషన్ దమాని టాప్లో ఉన్నారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2.38 లక్షల కోట్లకు చేరుకుంది. ఆయన తర్వాత ఫ్లిప్కార్ట్ ఫౌండర్లు బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్ ఉన్నారు. ఈ లిస్టులోని ఎంటర్ప్రెనూర్లలో సగం కంటే ఎక్కువ మంది బెంగళూరు, ముంబై, గురుగ్రామ్ల నుంచే ఉన్నారు. ఈ సిటీలు ఎంటర్ప్రెనూర్షిప్కు హబ్లుగా మారాయని ఐడీఎఫ్సీ–హురున్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది. ఈ లిస్టులో జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్, డ్రీమ్11 ప్రమోటర్లు భవిత్ శేత్, హరిష్ జైన్ చోటు సంపాదించుకున్నారు. జొమాటో మార్కెట్ రూ.86,835 కోట్లు కాగా, డ్రీమ్11 మార్కెట్ క్యాప్ రూ.66,452 కోట్లు. 2000 తర్వాత ఏర్పాటై, అత్యంత విలువైన కంపెనీలుగా ఎదిగిన లిస్టులో మొదటి పది స్టార్టప్లే ఉన్నాయి.
405 మంది ఫౌండర్లు అత్యంత విలువైన 200 కంపెనీలను ఏర్పాటు చేశారు. వీరిలో 56 శాతం మంది ఇంజినీరింగ్ చదవగా, 10 మంది సీఏ, ఏడుగురు ఎంబీబీఎస్ పూర్తి చేశారు. మహిళల్లో నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్ టాప్లో ఉన్నారు. యంగెస్ట్ వుమెన్ ఎంటర్ప్రెనూర్గా మమఎర్త్ ఫౌండర్ ఘజల్ అలఘ్, వింజో ఫౌండర్ సౌమ్య సింగ్ నిలిచారు. వీరిద్దరి వయసు 35 ఏళ్లే. కాగా, ఐడీఎఫ్సీ– హురున్ సెల్ఫ్ మేడ్ 200 ఎంటర్ప్రెనూర్ లిస్ట్లోని కేవలం 25 శాతం కంపెనీలు మాత్రమే మార్కెట్లో లిస్ట్ అయ్యాయి.