కూకట్పల్లి, వెలుగు: ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. శంషీగూడలో నివసించే దేవరకొండ కిషోర్(30) ఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం ఉదయం బైక్ పై ప్రగతినగర్కు వెళ్తున్నాడు. ప్రగతినగర్ చెరువు వద్ద ముందు వెళుతున్న బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి బస్సు టైర్ కింద పడ్డాడు. తీవ్రగాయాలతో స్పాట్లో చనిపోయాడు.
