బషీర్ బాగ్, వెలుగు: దేశంలో బీసీల లెక్కలు తేల్చాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కులగణన, ఓబీసీల సమస్యలపై ఆలిండియా ఓబీసీ స్టూడెంట్ల అసోసియేషన్ అధ్యక్షుడు గౌడ్ కిరణ్ కుమార్ అధ్యక్షతన శనివారం రవీంద్రభారతిలో సమావేశం జరిగింది.
చీఫ్గెస్టుగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో కుక్కలు, పందులు, పక్షులకు కూడా లెక్కలున్నాయని, బీసీలకు లేకపోవడం దారుణమన్నారు. బీసీలు ఓట్లేస్తేనే దేశంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం, పీఎం అవుతున్నారన్నారు.
బీసీ మేధావులు, స్టూడెంట్లు హక్కుల కోసం గళమెత్తాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య, విల్సన్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్టూడెంట్లు పాల్గొన్నారు.