- కేటీఆర్ పర్యటనలో అపశ్రుతి
జీడిమెట్ల/పద్మారావునగర్, వెలుగు: జీడిమెట్లలో కేటీఆర్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. న్యూస్కవరేజికి వచ్చిన ఆజ్తక్ టీవీ చానెల్ కెమెరామ్యాన్ దామోదర్ గురువారం గుండెపోటుతో చనిపోయారు. న్యూస్ కవరేజ్ చేస్తుండగా గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలాడు.
దీంతో పోలీసులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. గాంధీ దవాఖానలో దామోదర్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాంధీ ఆసుపత్రికి వచ్చిన కేటీఆర్.. దామోదర్ మృతదేహానికి నివాళులర్పించారు.
