హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వ్యాపారాలు అనుకోకుండా అధిక విద్యుత్ బిల్లులు చెల్లించకుండా అవగాహన కల్పించేందుకు హైదరాబాద్కు చెందిన భారత్ స్మార్ట్ సర్వీసెస్ “ఉగాది సంకల్పం 2026 – జీరో ఎక్సెస్ బిల్ తెలంగాణ ఉద్యమం”ను చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రారంభించింది.
ఈ కార్యక్రమాన్ని ఎల్టీ (లో టెన్షన్) కేవీఏహెచ్ వినియోగిస్తున్న చిన్న, మధ్యతరహా వ్యాపారుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. సుమారు 60 మంది సభ్యులు డోర్ టు డోర్ వెళ్లి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
