దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఈగ’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అందులోని కిచ్చా సుదీప్ క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత బాహుబలిలోనూ ఓ పాత్రలో మెరిశాడు సుదీప్. ఇక అప్పట్నుంచీ రాజమౌళికీ, సుదీప్ కి మంచి సంబంధం ఏర్పడింది. అయితే తాజాగా సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘విక్రాంత్ రోణ’ రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి.. సుదీప్ కు, ఆ మూవీ టీంకు శుభాభినందనలు తెలియజేశారు. సుదీప్ ఎప్పుడూ ప్రయోగాలు చేయడానికి, సవాళ్లను స్వీకరించడానికి ముందుంటాడన్న ఆయన.. 'విక్రాంత్ రోణ'లో అతని నటనను చూసేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయని మెచ్చుకున్నారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్ లు నిర్మించగా.. రేపు (జులై29న) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Sudeep is always first in experimenting & taking up challenges. Can’t wait to see what he has done in #VikrantRona. The visuals look grand. My best wishes to @KicchaSudeep and the entire team for their release tomorrow.
— rajamouli ss (@ssrajamouli) July 27, 2022