హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు  ప్రమాదం జరిగింది. ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ దగ్గర ఎదురెదురుగా వస్తున్న కారు, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.

అన్నదమ్ముల కుటుంబాలు ఏటూరునాగారం నుంచి వేములవాడ దైవదర్శనానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతులు మంతెన కాంతయ్య(72),మంతెన శంకర్ (60),మంతెన భారత్ (29),మంతెన మందన(16) గా గుర్తించారు. మృత దేహాలను  ఎంజీఎం మార్చురీకి తరలించారు.