ములుగు/ జనగామ అర్బన్/ కాశీబుగ్గ/ భూపాలపల్లి రూరల్/ ఖమ్మం టౌన్/ ఏటూరునాగారం, వెలుగు : ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ములుగు కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు వివిధ సమస్యలపై 67 అర్జీలు వచ్చాయని కలెక్టర్బోర్ఖడే హేమంత్సహదేవరావు తెలిపారు. జనగామలో 326 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ సందీప్కుమార్ఝా పేర్కొన్నారు. వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 153 వినతులు వచ్చాయని కలెక్టర్సత్యశారద చెప్పారు.
జయశంకర్భూపాలపల్లిలో 81 దరఖాస్తులు వవచ్చినట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. అనంతరం గత ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారంపై ఆయన సమావేశం నిర్వహించి అప్డేట్స్ తెలుసుకున్నారు. ఖమ్మం కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కాగా, ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏలో నిర్వహించిన గిరివాణికి 10 వినతులు వచ్చాయని డిప్యూటీ డైరెక్టర్ జనార్దన్తెలిపారు.
