తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తాపడిన కారు

తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తాపడిన కారు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డు 16వ మలుపు వద్ద ఓ కారు అదుపు తప్పి బోల్తాపడింది. కర్ణాటకకు చెందిన కారు గా గుర్తించారు.  ఆ సమయంలో కారులో నలుగురు ఉన్నారు.కారులోని వారికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను 108లో తిరుపతిలో ని ఆసుపత్రికి తరలించారు.  

ALSO READ:నల్లమలలో వెలుగులోకి వచ్చిన అద్భుత జలపాతం

ఇతర వాహనాల వారు ఈ విషయాన్ని టీటీడీ భద్రతా సిబ్బందికి తెలియజేశారు. వెంటనే స్పందించిన సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని కారు నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. కారులోని వారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.