భారీగా పెరగనున్న కార్ల ధరలు

భారీగా పెరగనున్న కార్ల ధరలు

మార్చి నెలతో ఆదాయం పన్నులు సంవత్సరం ముగియనుండటంతో..వచ్చెనెల నుంచి కార్ల ధరలను పెంచే పనిలో పడ్డాయి పలు సంస్థలు. ప్రముఖ  కార్ల తయారీ సంస్థ  టాటా మోటార్స్ కార్ల ధరలు పెరగనున్నాయి.  ఏప్రిల్‌ నుంచి  మోడళ్ల ప్యాసెంజర్‌ కార్ల ధరలను పెంచుతున్నట్టు శనివారం కంపెనీ  ప్రకటించింది. ఈ పెంపు  25 వేల రూపాయల దాకా ఉంటుందని తెలిపింది. ఆర్థిక పరిస్థితులు, ఇన్‌ పుట్‌  వ్యయాల కారణం ధరలను పెంచుతున్నట్టు తెలిపింది.  టయోటా, జాగ్వర్‌ ల్యాండ్‌ రోవర్‌ ధరలు పెరుగుతాయని చెప్పింది.

మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న ఇన్‌ పుట్ వ్యయాలు, వివిధ బాహ్య ఆర్థిక కారకాల కారణంగా ధరలను పెంచుతున్నామని  టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్  మయాంక్‌ పారిక్‌  తెలిపారు.