- ఇద్దరు అరెస్ట్.. 16 కార్లు స్వాధీనం
మూసాపేట, వెలుగు:సెల్ఫ్ డ్రైవింగ్ సంస్థల నుంచి కార్లను అద్దెకు తీసుకుని వాటిని మరో చోట అమ్ముతున్న ఇద్దరిని బాలానగర్ ఎస్వోటీ, సనత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం బాలానగర్ డీసీపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. గాజులరామారంలోని కైసర్ నగర్కు చెందిన మహ్మద్ ఒమర్(28), బీకే గూడకు చెందిన నర్సగోని ప్రవీణ్ కుమార్ గౌడ్(39), అహ్మద్ అలీ ఈ ముగ్గురు గ్యాంగ్గా ఏర్పడి సెల్ఫ్ డ్రైవింగ్ సంస్థల నుంచి కార్లను రెంట్కు తీసుకునేవారు. మూడు నెలల పాటు వాటికి రెంట్ను టైమ్కు చెల్లించేవారు.
కొన్నిరోజుల తర్వాత ఆ కార్లకు ఉన్న జీపీఎస్ను తొలగించేవారు. కార్లను మరో చోట తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని పారిపోయేవారు.కొంతకాలం తర్వాత ఫోన్ నంబర్, అడ్రెస్ మార్చి మళ్లీ ఇదే తరహా మోసాలకు పాల్పడేవారు. ముసాపిర్ సెల్ఫ్ కారు డ్రైవ్ సంస్థ, ఓ ట్రావెల్ ఏజెన్సీ ఇచ్చిన కంప్లయింట్తో కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన సనత్నగర్ పోలీసులు ఈ గ్యాంగ్పై నిఘా పెట్టారు. మహ్మద్ ఒమర్, ప్రవీణ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్కు చెందిన మరో నిందితుడు అహ్మద్ అలీ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. సనత్నగర్, బాచుపల్లి, జగద్గిరిగుట్ట, వనస్థలిపురం, ఎస్ఆర్ నగర్ ఏరియాల్లో నిందితులు తాకట్టు పెట్టిన 16 కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.