‘హిమాయత్ సాగర్’ నీటి దొంగలపై కేసు..వీ 6 వెలుగు కథనానికి స్పందన 

‘హిమాయత్ సాగర్’ నీటి దొంగలపై కేసు..వీ 6 వెలుగు కథనానికి స్పందన 

హైదరాబాద్​సిటీ, వెలుగు: హిమాయత్ సాగర్ నుంచి నీటి దోపిడీకి పాల్పడుతున్న వారిపై రాజేంద్రనగర్​ పీఎస్​లో కేసు నమోదు చేసినట్టు వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. హిమాయత్​సాగర్, ఉస్మాన్​సాగర్​జలాశయాల నుంచి పైపులు, బోర్లు వేసి నీటిని దొంగిలిస్తున్న తీరుపై శనివారం వీ6 వెలుగులో  ‘జంట రిజర్వాయర్లలో నీటి దొంగలు’ పేరిట కథనం పబ్లిష్ అయ్యింది.

దీనికి వాటర్​బోర్డు అధికారులు స్పందించారు. హిమాయత్ సాగర్ సమీపంలోని ఎఫ్‌‌టీఎల్ నంబర్లు 33, 34 పరిధిలో తనిఖీలు నిర్వహించగా అక్రమంగా ఏర్పాటు చేసిన రెండు బోర్‌‌వెల్స్, నీటి సరఫరా వ్యాపారానికి వినియోగిస్తున్న నిల్వ ట్యాంక్‌‌ను గుర్తించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న బుచ్చిబాబుపై రాజేంద్రనగర్ పీఎస్​లో ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేశారు.