మద్యం తాగి కారుతో బీభత్సం.. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ పై కేసు

మద్యం తాగి కారుతో బీభత్సం.. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ పై కేసు
  • ‘‘అరే ఏంట్రా ఇది.. వచ్చే మూడేళ్లలో నేనేంటో చూపిస్తా’’ అంటూ పోలీసులపైనే చిందులు

హైదరాబాద్: యూట్యూబ్, టిక్ టాక్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ మద్యం తాగి కారుతో బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి జూబ్లిహిల్స్ పోలీసు పరిధిలోని జర్నలిస్టు కాలనీ హుడా హైట్స్ వద్ద మూడు కార్లు రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టాడు. కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.  ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ ఉబర్ బైక్ డ్రైవర్ విష్ణును  హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. తన మిత్రుడితో కలసి కారులో వెళ్తున్న జస్వంత్ ప్రమాదం అనంతరం ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తించాడు. విచారణలో పోలీసులతో సైతం దురుసుగా ప్రవర్తించాడు. సినిమా తరహాలో ఆవేశంతో ఊగిపోతూ.. ‘‘అరే ఏంట్రా ఇది.. వచ్చే మూడేళ్లలో నేనేంటో  చూపిస్తా..’’ అంటూ పోలీసులపైనే చిందులేశాడు షణ్ముఖ్. హ్యాంగోవర్ తో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే  బ్రీత్ ఎనలైజర్ తో చెక్ చేయగా మద్యం తాగినట్లు తేలింది. బ్రీత్ అనలైజర్ రీడింగ్ 170 గా  నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పరిమితికి మించి మద్యం సేవించడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు.

For More News..

కోవిడ్ టీకా ధర రూ.250.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం

మోడీ కేరళ, అస్సాం వెళ్తారు.. రైతుల దగ్గరకు మాత్రం వెళ్లరు

కొడుకు పుట్టిన ఆనందంలో డ్యూటీ కోసం వేల కిలోమీటర్లు వెళ్లి..

క్లాస్ రూమ్‌లో లేడీ టీచర్ పై కత్తితో దాడి