ఉప ఎన్నికల సందర్భంగా కరోనా నిబంధనలు పాటించని పలువురిపై కేసు

ఉప ఎన్నికల సందర్భంగా కరోనా నిబంధనలు పాటించని పలువురిపై కేసు
  • హుజూరాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్

కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కరోనా నిబంధనలు పాటించని పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద ఎన్నికల నిబంధనలు, కరోనా నియమాలు పాటించని పలువురిని గుర్తించి కేసు నమోదు చేసినట్లు హుజూరాబాద్ టౌన్  సి ఐ  శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం  హుజూరాబాద్ అబేద్కర్ చౌక్ వద్ద ఎన్నికల నిబంధనలు, కరోనా నియమాలకు విరుద్ధంగా కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు గుమికూడడంతో వారిపై కేసులు నమోదు చేశామని ఆయన వివరించారు. అలాగే కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించగా వారిని కూడా గుర్తించి కేసు నమోదు చేసామని సీఐ తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతిఒక్కరూ ఎన్నికల నియమాలు పాటించాలని సీఐ శ్రీనివాస్ కోరారు.