హైదరాబాద్, వెలుగు : ఓటర్లను చైతన్యం చేసేలా స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ జి. రమేశ్ రూపొందించిన ‘ఓడిపోనీయకు నీ ఓటును..’ పాటల సీడీని డైరెక్టర్ శ్రీ దేవసేన శనివారం రిలీజ్ చేశారు.
ఓటు విలువ, ప్రజాస్వామ్యం గొప్పతనం గురించి చెప్తూ దీన్ని రూపొందించడంపై పాట రచయిత, గాయకుడు రమేశ్ను డైరె క్టర్ అభినందించారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ లింగయ్య ఉన్నారు.