హైదరాబాద్, వెలుగు : చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్బిల్లుకు కేంద్ర కేబినెట్ఆమోదం తెలపడం, మంగళవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి వద్ద సంబురాలు చేశారు. పలువురు మహిళా నేతలు బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి చేరుకొని కవితకు అభినందనలు తెలిపారు. మహిళా బిల్లు కోసం ఢిల్లీలోని జంతర్మంతర్వద్ద కవిత ఒక్క రోజు దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఇటీవల దేశంలోని 47 రాజకీయ పార్టీలకు లేఖలు కూడా రాశారు. కాగా, బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తుందని ఆశిస్తున్నానని కవిత తెలిపారు.
దీనికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్, కేసీఆర్ స్ఫూర్తితోనే మహిళా బిల్లు కోసం ఉద్యమించామన్నారు. ఓబీసీల సంఖ్య తేలాలంటే కుల గణన చేయాలని, డీలిమిటేషన్ఎప్పుడు చేస్తారు? ఈ బిల్లును ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తారనే అంశాలపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని ఆమె డిమాండ్చేశారు.
బిల్లుకు ఉభయ సభల్లో బీఆర్ఎస్మద్దతునిస్తుందని తెలిపారు. అలాగే, మంగళవారం సెర్ప్హెడ్ఆఫీస్లో కవిత ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ బిల్లుతో తెలంగాణలో 40 మంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో సెర్ప్ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.