వివేక్కు మంత్రి పదవి ఇవ్వడంపై సంబురాలు.. మాల ఉద్యోగులు, అంబేడ్కర్ సేవా సంఘాల వేడుకలు

వివేక్కు మంత్రి పదవి ఇవ్వడంపై సంబురాలు.. మాల ఉద్యోగులు, అంబేడ్కర్ సేవా సంఘాల వేడుకలు

ఇబ్రహీంపట్నం, వెలుగు: మంత్రివర్గంలో గడ్డం వివేక్ వెంకటస్వామికి చోటు ఇవ్వడం హర్షనీయమని రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం నాయకుడు భర్తాకి కరుణాకర్ అన్నారు. సోమవారం (June 9) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్​ చౌరస్తాలో మాల ఉద్యోగుల సంఘం, అంబేడ్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, బాణసంచా కాల్చి స్వీట్లు పంచారు. 

ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి పోరాడుతున్న వివేక్ కు మంత్రి ఇవ్వడంతో సామాజిక న్యాయం జరిగిందన్నారు. మహానాడు జిల్లా నాయకుడు, మాజీ కౌన్సిలర్ భర్తాకి జగన్ మాట్లాడుతూ.. దలిత ముద్దు బిడ్డకు సముచిత స్థానం కల్పించిన కాంగ్రెస్​కు ధన్యవాదాలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ సేవా సంఘం అధ్యక్షుడు బండి నర్సింగ్ రావ్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బండి మహేశ్, ఉద్యోగులు కొరివి రవి, యాలాల శ్రావణ్, నూకలు ఆనంద్, లకుమాళ్ల కిరణ్, యాంజల లక్ష్మయ్య, దాసరి మురళి తదితరులు పాల్గొన్నారు.