విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త రూల్

విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త రూల్

విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం కొత్తరూల్ తీసుకొచ్చింది. విద్యార్థుల వయస్సు ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ రూల్ అమలు చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కేంద్రీయ విద్యాలయాల్లో 6 ఏళ్లు ఉన్న విద్యార్థులకే ఒకటో తరగతిలో అడ్మిషన్లు ఇస్తున్న విషయం తెలిసిందే.