బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ డెత్ మిస్టరీ పై సీబీఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. విచారణలో భాగంగా రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్నట్లు సీబీఐ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రియా తన సన్నిహితులతో చేసిన వాట్సాప్ చాటింగ్ లో సుశాంత్ కాఫీ, టీలో మత్తు మందు కలిపినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా సీబీఐ అధికారులు సుశాంత్ తాగే కాఫీ, టీలలో రియా చక్రవర్తి డ్రగ్స్ కలిపిందా..? డ్రగ్స్ కలిపితే ఉద్దేశపూర్వకంగా కలిపిందా..? లేదంటే సుశాంత్ ఇష్టంతోనే కలిపిందా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ప్రముఖ మీడియా సంస్థ ఐఎన్ ఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. సుశాంత్ తాగే కాఫీ, టీలలో రియా మత్తు మందు కలిపిందనే అనుమానాలతో కేసు విచారణ కోణం పూర్తిగా మారినట్లు తెలుస్తోంది.
అంతేకాదు సీబీఐ అధికారులకు సుశాంత్ ఆహారపదార్ధాలలో డ్రగ్స్ కలిపినట్లు తనకు తెలిసినట్లు సుశాంత్ సహాయకుడు శామ్యూల్ మిరాండా చెప్పినట్లు సమాచారం.