కేంద్ర, రాష్ట్ర పథకాలను సమన్వయం చేయాలి : మంత్రి తుమ్మల సమీక్ష

కేంద్ర, రాష్ట్ర పథకాలను సమన్వయం చేయాలి :  మంత్రి తుమ్మల సమీక్ష

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమన్వయం చేసి రైతులకు ప్రయో జనం చేకూర్చాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం సెక్రటేరియట్‌‌లో వ్యవసాయ, ఉద్యాన, మార్క్‌‌ఫెడ్‌‌, ఆయిల్‌‌ ఫెడ్‌‌, సీడ్‌‌ కార్పొరేషన్‌‌, మార్కెటింగ్‌‌ శాఖల రాష్ట్ర స్థాయి అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. కేంద్ర పథకాలను కొత్త టెక్నాలజీతో అనుసంధానించి వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సూచించారు.

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, వ్యవసాయ మౌలిక అభివృద్ధి నిధి, ధరల నియంత్రణ నిధి వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్ర రైతులు లబ్ధిపొందే విధంగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట సాగు, మార్కెటింగ్​లో రైతులకు ఎదురయ్యే సమస్య లను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవా లని సూచించారు. రాష్ట్రంలోని సహకార సం ఘాలను బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ డైరెక్టర్‌‌ గోపి, మార్కె టింగ్‌‌శాఖ డైరెక్టర్‌‌ లక్ష్మీబాయి, మార్క్‌‌ఫెడ్‌‌ ఎండీ సత్యనారాయణరెడ్డి, సీడ్‌‌ కార్పొరేషన్‌‌ ఎండీ కేశవులు, అగ్రికల్చర్‌‌ ఏడీ విజయ్‌‌ కుమార్‌‌ తదితరులు పాల్గొన్నారు.

ఏఈవోల సమస్యలు పరిష్కరిస్తం

వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారుల సమ స్యలు పరిష్కరిస్తామని మంత్రి తుమ్మల తెలిపా రు. ఏఈవోల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ ఆధ్వర్యంలో సంఘం రూపొందించిన డైరీని బుధవారం మంత్రి తుమ్మల ఆవిష్కరించి మాట్లాడారు. గత బీఆర్ఎస్  సర్కారు హయాంలో రాష్ట్రంలో క్లస్టర్లకు అనుగుణంగా ఏఈవోల నియామకం జరగలేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఏఈవోలకు  ఎదురువుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఏఈవోల క్యాలెండర్‌‌ను అగ్రికల్చర్‌‌  డైరెక్టర్‌‌  గోపి ఆవిష్కరించారు.