తాజ్ కృష్ణలో సీఎస్, డీజీపీలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ

తాజ్ కృష్ణలో  సీఎస్, డీజీపీలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ

రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన కొనసాగుతోంది. ఇవాళ తాజ్ కృష్ణాలో CS శాంతికుమారి, డీజీపీ అధికారులతో భేటీ అయ్యారు. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. ఎన్నికల ఏర్పాట్లపై వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికలు పారదర్శకంగా జరపాలని రాష్ట్ర అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. ఇవాళ్టితో మూడు రోజుల కేంద్ర ఎన్నికల సంఘం టూర్ ముగుస్తోంది.