ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన నవంబర్ 28వ తేదీన హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమోషనల్ కామెంట్స్ పై ఈసీ స్పందించింది. కౌశిక్రెడ్డి చేసిన కామెంట్స్ పై విచారణ జరిపి విచారణ జరిపి నివేదక పంపాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారులను ఆదేశించింది. హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపిస్తారా? లేక కుటుంబమంతా ఉరేసుకోమంటరా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కౌశిక్రెడ్డి తన భార్య, కూతురుతో కలిసి హనుమకొండ జిల్లా కమలాపూర్లో రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మీరు ఓటేసి గెలిపిస్తారా? లేదంటే కమలాపూర్ బస్టాండ్లో మా కుటుంబమంతా ఉరేసుకోమంటరా? మీరు ఓటెయ్యకుంటే మా ముగ్గురి శవాలు చూడున్రి.. ఓటేసి దీవిస్తే జైత్రయాత్రకు వస్తా.. లేకుంటే 4వ తారీఖున మా శవయాత్రకు రండి” అని అన్నారు. ‘‘మీ దయ అంటున్న.. మీ దండం అంటున్న.. మీ గదవలు పట్టుకుంటున్న.. మీ కడుపులో తలకాయ వెడ్తున్న..’’ అంటూ ప్రాధేయపడ్డారు.