
రామడుగు, వెలుగు: కరీంనగర్–జగిత్యాల హైవేను ఆరు లేన్లుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం రామడుగు మండలం వెదిర గ్రామంలో కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ ఆధ్వర్యంలో ఆర్ఐ రజిని, నేషనల్ సర్వే అధికారులు సర్వే చేపట్టారు. సర్వే నివేదికను పూర్తిస్థాయిలో ఎన్ హెచ్ అధికారులకు పంపిస్తామని ఆర్డీవో తెలిపారు.