జగన్ ప్రభుత్వంలో అవినీతి తప్ప.. ఏం కనిపించట్లేదు: హోం మంత్రి అమిత్​షా

జగన్ ప్రభుత్వంలో అవినీతి తప్ప.. ఏం కనిపించట్లేదు: హోం మంత్రి అమిత్​షా

ఏపీ సీఎం వై ఎస్​ జగన్మోహన్​రెడ్డి నాలుగేళ్ల పాలనలో అవినీతి తప్పా ఇంకేమీ కనిపించలేట్లేదని కేంద్ర హోం మంత్రి అమిత్​షా విమర్శించారు.  ప్రధాని మోడీ 9 ఏళ్ల పాలన విజయాలపై విశాఖ పట్టణంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వైసీపీ నాయకులు తమవిగా చెప్పుకుంటున్నారన్నారు. తమది రైతు ప్రభుత్వం అని అంటున్న సీఎం జగన్​ రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో నిలవడంపై ఏం సమాధానం ఇస్తారని  ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన డబ్బులను రైతు భరోసా పేరుతో జగన్​పంచుతున్నారన్నారు. బియ్యం సప్లైపై కూడా జగన్​ ఫొటోలు ముద్రిస్తున్నారన్నారు.

అరాచకాలకు అడ్డాగా వైజాగ్​

వైజాగ్​ను  భూమాఫియా, మైనింగ్​మాఫియా తదితర అరాచకాల శక్తులకు అడ్డాగా వైసీపీ మార్చిందని విమర్శించారు. సికింద్రాబాద్​– విశాఖపట్నం – తిరుపతిలకు కేంద్రం 2 వందే భారత్​ రైళ్లు తెచ్చిందని తెలిపారు. విశాఖ రైల్వే స్టేషన్​ అభివృద్ధికి రూ.450 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.  రాష్ర్టంలో ఎన్నో కొత్త రైల్వేలైన్లు, జాతీయ రహదారులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. సాగరమాల పథకం కింద ఏపీకి అదనంగా రూ. 85 వేల కోట్లు కేటాయించినట్లు వివరించారు. రాష్ర్ట ప్రభుత్వం అవినీతి వల్లే ఈ నిధులు కనిపించట్లేదని ఆరోపించారు. 

రాహుల్​పై విసుర్లు..

ప్రధాని మోడీ దేశాభివృద్ధి కోసం కృషి చేస్తుంటే కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ విదేశాల్లో దేశ పరువును తీస్తున్నారని విమర్శించారు. కశ్మీర్​లో ఆర్టికల్​ 370 ని రద్దు చేయాలంటే కాంగ్రెస్​ వెనకడుగేసిందని కానీ తాము చేసి చూపించామని తెలిపారు.  వచ్చే లోక్​సభ ఎన్నికల్లో 300 సీట్లకు పైగా బీజేపీ సాధిస్తుందని.. ఏపీ నుంచి 25 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు విన్నవించారు.