ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి : ఆశ్విని శ్రీవాత్సవ్​

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి : ఆశ్విని శ్రీవాత్సవ్​
  •     సెంట్రల్​ జాయింట్​ సెక్రెటరీ ఆశ్విని శ్రీవాత్సవ్​

కామారెడ్డి, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వద్దకు చేర్చడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ సర్కార్​ వికసిత్​ భారత్ ​సంకల్ప యాత్రను ప్రారంభించిందని సెంట్రల్​ జాయింట్​ సెక్రెటరీ, జిల్లా నోడల్​ఆఫీసర్ ​ఆశ్విని శ్రీవాత్సవ్​ పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి 2024, జనవరి 26 వరకు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. వికసిత్ ​భారత్​ సంకల్ప యాత్రలో భాగంగా శనివారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో ప్రోగ్రామ్​ ప్రారంభించారు. జిల్లాకు చేరిన ప్రచార రథాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ గా ప్రారంభించారు.

ఆశ్విని శ్రీవాత్సవ్​ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల చెంతకు తీసుకెళ్లడం, అర్హులైన కొత్త లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ ప్రోగ్రామ్ ను​చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదప్రజల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. అందులో శానిటేషన్, ఆర్థిక సాయం, ఎల్పీజీ కనెక్షన్లు, ఇండ్లు, ఆహార భద్రత, విద్య, వైద్యం, తాగునీటి సప్లయ్​ లాంటి స్కీమ్​లు ఉన్నాయన్నారు.

జిల్లాలో ఏడు వెహికిల్స్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో ఆయా శాఖల ఆఫీసర్లతో నోడల్​ఆఫీసర్​సమావేశమయ్యారు. ప్రోగ్రామ్​లో జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఎంహెచ్​వో లక్ష్మణ్​సింగ్, డీఎస్ వో మల్లికార్జున్, సివిల్​సప్లయ్​డీఎం అభిషేక్​సింగ్, సర్పంచ్​రత్నాబాయి పాల్గొన్నారు.

నందిపేట : కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జడ్పీ చైర్మన్​ దాదన్నగారి విఠల్​రావ్​ కోరారు. శనివారం నందిపేట్​మండలంలోని కొండూర్ లో నిర్వహించిన వికసిత్​ భారత్ సంకల్ప్​యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విఠల్​రావు మాట్లాడుతూ ఈ యాత్ర డిసెంబరు 16 నుంచి జనవరి 4 వరకు నందిపేట మండలంలో కొనసాగుతుందన్నారు.

ప్రోగ్రామ్​లో భాగంగా అర్హులైన వారి నుంచి పింఛన్లు, గృహ నిర్మాణాలు తదితర సంక్షేమ పథకాలకు సంబందించి దరఖాస్తులు తీసుకుంటారని జడ్పీ చైర్మన్​తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గోవింద్, ఎంపీడీవో నాగవర్ధన్, తహసీల్దార్​ఆనంద్​కుమార్, స్థానిక సర్పంచ్​ ప్రభాకర్, ఎంపీవో కిరణ్​ పాల్గొన్నారు.
బాల్కొండ: ప్రతి పౌరుడికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ప్రధాని మోదీ సంకల్పమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

శనివారం వేల్పూరు మండలం లాక్కోరాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అడిషనల్​ కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి ఆయన  ప్రారంభించారు. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల పరిధిలో యాత్ర కొనసాగుతుందని చెప్పారు. డీఆర్డీవో చందర్ నాయక్, డీపీవో జయసుధ, లీడ్ బ్యాంక్  మేనేజర్ శ్రీనివాస్ రావు, డీఈఓ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.