ఇక టీజీ పేరుతో వెహికల్​ రిజిస్ట్రేషన్​

ఇక టీజీ పేరుతో వెహికల్​ రిజిస్ట్రేషన్​

హైదరాబాద్, వెలుగు:  రాష్ర్టంలో కొత్త  వెహికల్స్ ఇక నుంచి టీజీ పేరుతో రిజిస్ర్టేషన్ కానున్నాయి.  ఇప్పటి వరకు ఉన్న టీఎస్ పేరును టీజీగా మార్చాలని రాష్ర్ట ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. మంగళవారం ఈ అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

 గత నెల 6న ఈ ప్రతిపాదనను కేంద్రానికి  పంపగా.. అధికారులు పరిశీలించి టీజీగా మార్చేందుకు అనుమతి ఇచ్చారు. కాగా.. సాఫ్ట్ వేర్ లో కొద్దిగా మార్పులు చేస్తే సరిపోతుందని, కేంద్ర గెజిట్ కు అనుగుణంగా రాష్ర్ట ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర సర్కారు నుంచి నోటిఫికేషన్ రాగానే..కొత్త వెహికల్స్ రిజిస్ర్టేషన్ కు టీజీ పేరుతో చేస్తామని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.