గుడ్ న్యూస్ చెప్పిన మోదీ .. ఉచిత రేషన్ మరో ఐదేళ్లు

గుడ్ న్యూస్  చెప్పిన  మోదీ .. ఉచిత రేషన్ మరో ఐదేళ్లు

ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ  ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు.   80  కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.  ఛత్తీస్‌గఢ్‌ పర్యటలనలో భాగంగా మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు . ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరుతో 2022 కరోనా టైమ్ లో కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని  ప్రవేశపెట్టింది.  

ఈ పథకంలో భాగంగా ఒక వ్యక్తికి ఉచితంగా ఐదు కిలోల బియ్యా్న్ని ఉచితంగా పంపిణీ చేస్తుంది.  తాజాగా మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  దీంతో కేంద్ర ప్రభుత్వంపై రూ.  2 లక్షల కోట్ల భారం పడనుంది.   ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతులతో పాటు పలు వర్గాలకు ఎన్నికల హామీల్ని ఇస్తూ, పలు పథకాలు ప్రకటిస్తున్న ప్రధాని మోడీ ఇదే క్రమంలో ఉచిత రేషన్ పథకం కొనసాగింపును కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది.