నేపాల్ భారీ భూకంపం విధ్వంసం సృస్టించింది. శుక్రవారం రాత్రి 6.4 తీవ్రతలో సంభవించిన భూకంపంతో 150 మందిగాపై ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో నేపాల్ కు భారత్ బాసట నిలిచింది. సహాయక చర్యలు చేపట్టేందుకు భారత్ ముందుకు వచ్చింది. నేపాల్ ప్రజలకు భారత్ తోడుగా నిలుస్తుందని.. సాధ్యమైన సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్దంగా ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు. మరోవైపు నేపాల్ లోని భారతీయులకోసం భారత్ అత్యవసర సంప్రదింపుల నంబర్ ను విడుదల చేసింది. నేపాల్ సంభవించిన భూకంపం కారణంగా సాయం కోరుతున్న వారికోసం ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్: +977-9851316807ను విడుదల చేసింది.
Deeply saddened by loss of lives and damage due to the earthquake in Nepal. India stands in solidarity with the people of Nepal and is ready to extend all possible assistance. Our thoughts are with the bereaved families and we wish the injured a quick recovery. @cmprachanda
— Narendra Modi (@narendramodi) November 4, 2023
Also Read :- నేపాల్ భూకంప బాధితులకు అండగా ఉంటాం
నేపాల్ లో శుక్రవారం అర్థరాత్రి జాజర్ కోట్ జిల్లా కేంద్రంగా సంభవించింది.. భూకంపం ధాటికి వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. జాజర్ కోట్ లో 92 మంది ప్రాణాలు కోల్పోగా.. రుకమ్ జిల్లాల్లో 36 మరణించారు. 85 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స కోసం జాజర్ కోట్ ఆస్పత్రులకు తరలించారు.
?#Alert#Emergency Contact Number for Indians requiring assistance due to the recent earthquake in Nepal:
— IndiaInNepal (@IndiaInNepal) November 4, 2023
+977-9851316807@MEAIndia