గవర్నర్ను కలిసిన సీఈవో వికాస్రాజ్

గవర్నర్ను కలిసిన సీఈవో వికాస్రాజ్

రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సోసోమవారం (డిసెంబర్ 4) భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల లిస్ట్ ను గవర్నర్ కు అందజేశారు. అభ్యర్థుల లిస్ట్ పరిశీలన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కాంగ్రెస్ను ఆహ్వానించనున్నారు గవర్నర్. 

మరోవైపు ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది.. పార్టీ అధిష్టానం.. కాంగ్రెస్ సీనియర్ నేతలతో పలు సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఢిల్లీ ఏఐసీసీకి పంపారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఏఐసీసీ నిర్ణయం ప్రకారం సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. సీఎల్పీ నేతగా, సీఎం అభ్యర్థిగా దాదాపు రేవంత్ రెడ్డి పేరు ఖారారైనట్లు తెలుస్తోంది.. సోమవారం సాయంత్రం వరకు తుది నిర్ణయం జరిగే అవకాశం ఉంది.